Cooler Shock: జుక్కల్, మే 10 (ప్రజా శంఖారావం): రాత్రి తల్లి కూతుర్లు కలిసి చల్లని గాలికి నిద్రపోయారు. తెల్లారేసరికి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఎండాకాలంలో చల్లని గాలి కోసం ఏర్పాటు చేసుకున్న కూలర్ వారి పాలిట యమపాశంగా మారి తల్లి కూతుర్లను బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే జుక్కల్ మండలం పెద్దగుళ్ల తండాలో శుక్రవారం రాత్రి సమక బాయ్ (34), శివాని (14)లు వారి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కూలర్ విద్యుత్ సరఫరాలో ప్రమాదవశాత్తు వారికి కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now