Metpally: అత్తారింటి ఎదుట అల్లుడి ఆందోళన

Metpally
Metpally

Metpally: మెట్ పల్లి/కోరుట్ల, మే 04 (ప్రజా శంఖారావం): కాలం మారుతుంది.. ఒకప్పుడు భర్తల ఇంటి ఎదుట భార్యలు ఆందోళన చేయడం మహిళా సంఘాలతో ధర్నాలు చేయడం చూశాం.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అత్తారింటికి దారేది అన్నట్లుగా ఉంది ఈయన వాలకం.. వివరాల్లోకి వెళితే.. కోరుట్ల పట్టణ కేంద్రంలో ప్రకాశం రోడ్డులో నివసిస్తున్న గాజుల అజయ్ తన భార్య కాపురానికి రావడం లేదంటూ అత్తారింటి ఎదుట మహిళా సంఘాలతో కలిసి ఆందోళనకు దిగారు.

భార్య కాపురానికి రాకపోగా తన రెండేళ్ల బాబుతో అత్తారింట్లోనే ఉంటుందని, తమ ఇంటికి కాపురానికి రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భర్త గాజుల అజయ్ భార్య శివాని ఇంటి ఎదుట కాపురానికి రావాలని కోరుతూ భార్యను అత్తమామలను ప్రాధేయపడ్డాడు. అజయ్ తో మెట్టినింటికి కాపురానికి వెళ్తే తనకు ప్రాణహాని తన అత్తమామలతో ఉందని శివాని తెలిపింది. భార్య కాపురానికి రాకపోవడంతో భర్త మహిళా సంఘాలతో కలిసి ఆందోళన చేసిన ఘటనపై చుట్టుపక్కల జనం ముక్కున వేలుసుకున్నారు. ఈ విషయం ఇలా ఉండగా ఎలాగైనా అజయ్ తో కలిసి కాపురానికి రావాలని శివానిని మహిళా సంఘాల మహిళలు సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now