Aadhaar Card: మనదేశంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఆధార్ కార్డు కూడా ఒక భాగం అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఏ పని చేయాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్ కార్డు పొందాలన్నా, ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఇలా ప్రతి ఒక్క పనికి కూడా ప్రస్తుతం ఆధార్ కార్డు తప్పనిసరిగా అవసరమవుతుంది. అయితే మన భారతదేశంలో మొట్టమొదటి ఆధార్ కార్డును మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ పొందింది. సెప్టెంబర్ 29, 2010లో నందుర్బార్ జిల్లాలో టెంబాలి అనే ఒక చిన్న గ్రామానికి చెందిన రంజన సోనావానే అని మహిళకు మనదేశంలో మొదటి ఆధార్ కార్డు జారీ చేయడం జరిగింది.
ఈ చరిత్రత్మక క్షణం కేవలం ఆ మహిళకు మాత్రమే కాదు ఆ మహిళ ఉన్న మహారాష్ట్రకు కూడా గర్వకారణం అని చెప్పొచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఆధార్ కార్డు పొంది పది సంవత్సరాలకు పైగా అయినా వ్యక్తులు వీలైనంత త్వరగా ఆధార్ కార్డును అప్లై చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అందరిని సూచించింది. ఇలా అప్డేట్ చేసుకోకపోతే భవిష్యత్తులో వాళ్ళు అనేక సేవలను పొందడంలో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
ఆన్లైన్లో కూడా మీరు యుఐడిఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా అన్ని వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఈ వివరాలను అప్డేట్ చేయడానికి మీకు కేవలం 50 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు. మీ సమీపంలో ఉన్న ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి మొబైల్ నెంబర్, ఈ మెయిల్, ఫోటో లేదా బయోమెట్రిక్ వంటి వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. దీనికి కూడా సాధారణంగా 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు రుసుము చెల్లించాలి. ఆధార్ కార్డును అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు సర్వేస్ రిక్వెస్ట్ నెంబర్ ఇస్తారు. ఆధార్ కార్డు 30 రోజులలోపు అప్డేట్ అవుతుంది. ఈ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ను ఉపయోగించి మీరు 30 రోజుల తర్వాత మీ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.