Indian Railways: రైలులో ప్రయాణించే వాళ్ళు.. రైల్వే కొత్త రూల్స్… తప్పకుండా ఇవి తెలుసుకోవాలి

Indian Railways
Indian Railways

Indian Railways: మే 1వ తేదీ నుంచి భారతీయ రైల్వే కొత్త నిబంధనలను అమలులోకి తెస్తుంది. ముఖ్యంగా కొత్త నిబంధనలు రైలులో టికెట్ బుకింగ్ చేసుకున్న వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులను ప్రభావితం చేస్తాయి. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులు ఇకపై స్లీపర్ కోచ్ లో లేదా ఏసీ కోచ్లలో ప్రయాణించడానికి అనుమతి ఉండదు అని తెలిపింది.

వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కలిగి ఉన్న ప్రయాణికులు కౌంటర్ నుంచి టికెట్ కొనుగోలు చేసిన మాదిరిగానే సాధారణ కోచ్ లలో మాత్రమే ఎక్కాల్సి ఉంటుంది. ఇకపై వారికి ఏసీ లేదా స్లీపర్ కోచ్ లలో ఎక్కడానికి అనుమతి ఉండదు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కొత్త నిబంధనల ప్రకారం వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో రిజర్వ్ కోచ్లలో ఎక్కితే వారిపై చర్యలు కూడా తీసుకుంటామని వెల్లడించింది. వెయిటింగ్ లిస్టు టికెట్లతో స్లీపర్ కోచ్ లో ఎక్కితే వారికి జరిమానా విధించనున్నారు.

అలాగే వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో ఏసీ కోచ్ లో ఎక్కితే వారికి కూడా జరిమానా పడనుంది. తాజాగా ప్రవేశపెట్టిన ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి బోర్డింగ్ పాయింట్ నుంచి తదుపరి స్టేషన్ వరకు చార్జీలను కూడా విధిస్తారు. రైల్వే ప్రయాణ టికెట్ ఎగ్జామినర్లు లేదా టిటిఇలు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించడం జరిగింది. ఒకవేళ వాళ్ళు రిజర్వ్డ్ కోచ్ లో ఎక్కడానికి ప్రయత్నిస్తే వారిని డిబోర్డింగ్ చేసి జరిమానా విధిస్తారు.

అలాగే గతంలో 120 రోజులు ఉన్న అడ్వాన్స్ రిజర్వ్ పిరియడ్ ఇప్పుడు 60 రోజులుగా చేశారు. గతంలో పర్యాటకులు నాలుగు నెలలు ముందుగానే టికెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు రెండు నెలల ముందు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రైల్వే ఆన్లైన్ టికెట్ల కొనుగోలులకు ఓటీపీ అవసరం నివేదికను ఇస్తూ ప్రయాణికులకు మరింత భద్రతను మెరుగుపరచడానికి అలాగే దుర్వినియోగాన్ని నిరోధించడానికి చర్యలను చేపడుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now