Bank Alert: బ్యాంకు కస్టమర్లకు హెచ్చరిక … ఏప్రిల్ 10 వరకు గడువు

Bank Alert
Bank Alert

Bank Alert: పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లకు ఒక ముఖ్యమైన అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో బ్యాంకు ఏప్రిల్ 10, 2025 నాటికి నో యువర్ కస్టమర్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలని కస్టమర్ లను కోరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక ప్రకటన విడుదల చేసింది. కేవైసీ రెన్యువల్ అవసరమైన అన్ని అకౌంట్లకు మార్చి 31, 2025 నాటికి అప్డేట్ అవసరం. బ్యాంకు తమ కస్టమర్లు ఎవరో నిర్ధారించడానికి ఉపయోగించే ప్రాసెసే కేవైసీ లేదా నో యువర్ కస్టమర్. అయితే కస్టమర్లు బ్యాంకు ఫ్రాడ్స్, మనీలాండరింగ్, ఇతర ఆర్థిక నేరాలకు చెక్ పెట్టాలంటే కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి.

ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటే ఆ బ్యాంకు కస్టమర్లు తమ పర్సనల్ డీటెయిల్స్, ఐడెంటిటీ ప్రూఫ్స్ అలాగే అడ్రస్ ప్రూఫ్స్ వంటి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు గడువు తేదీలోగా కేవైసీని పూర్తి చేయకపోతే ఆ ఖాతాదారుల అకౌంట్ ని ఫ్రీజ్ చేసే అవకాశం కూడా ఉంది. కేవైసీ ప్రాసెస్ మీరు పూర్తి చేసే వరకు తమ ఖాతాకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు కూడా చేయలేరు. మునుముందు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే గడువు తేదీలోగా కేవైసీ అప్డేట్ చేసుకోవడం మంచిది.

మీ యొక్క కేవైసీ ని అప్డేట్స్ చేసుకోవాలంటే ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి వంటివి అలాగే అడ్రస్ ప్రూఫ్ అంటే యుటిలిటీ బిల్లు లేదా ఆధార్ కార్డు వంటివి అవసరం అవుతాయి. వీటితోపాటు లేటెస్ట్ ఫోటో, పాన్ కార్డు లేదా ఫారం 60, ఇన్కమ్ ప్రూఫ్, మొబైల్ నెంబర్ వంటివి కూడా అవసరం అవుతాయి. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి కష్టమర్లు సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ వెళ్లవచ్చు. ఈ ప్రక్రియకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను బ్యాంక్ అధికారులకు అందజేస్తే సరిపోతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now