MS Dhoni: ఐపీఎల్ కు ధోని గుడ్ బై?.. 5 సార్లు ఛాంపియన్స్ గా నిలిచిన.. ఈ సారి ఢమాల్ పై.. కారణాలు ఇవే..

MS Dhoni
MS Dhoni

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి బలమైన జట్లలో ఒకటిగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి బలమైన జట్టుకు నాయకత్వం వహించి గెలుపు అనేది అలవాటుగా మార్చుకున్న టీం చెన్నై సూపర్ కింగ్స్. కానీ ఐపీఎల్ 2025 లో ఆ జట్టుకు ఏదీ కలిసిరావడం లేదు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ వైఫల్యంగా నే మారింది. చెన్నై ఇప్పటికే అయిదు సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. మూడు సార్లు రన్నరఫ్ గా దాదాపు ఎక్కువ సీజన్ లలో ప్లే ఆప్స్ కు వెళ్లిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రత్యేక మైన పేరు ఉంది. దీనికి తోడు మహేంద్ర దోని కెప్టెన్సీ కూడా ఆ జట్టుకు కొండంత బలంగా మారింది.

అంబటి రాయుడు, సురేశ్ రైనా, సుబ్రమణ్యం బద్రీనాథ్, మురళీ విజయ్ లాంటి టాప్ క్రికెటర్లు రిటైర్డ్ అయ్యారు. వీరు చెన్నై కు ఆడిన సమయంలో భారీగా పరుగులు చేశారు. టాప్ ఆర్డర్ తో పాటు మిడిలార్డర్ లో బ్యాటింగ్ చాలా దుర్భేద్యంగా ఉండేది. కానీ ఈ సీజన్ కు వచ్చేసరికి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆడిన రెండు మ్యాచులు విఫలమయ్యాడు. గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న శివమ్ దూబె.. రాణించలేకపోతున్నాడు. గత సీజన్ లో సిక్సుల మోత మోగించిన శివమ్ దూబె. ఈ ఐపీఎల్ లో ఫామ్ లో లేక రన్స్ చేసేందుకు అపసోపాలు పడుతున్నాడు.

బౌలింగ్ లో వీక్..

రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ విభాగానికి లీడర్లుగా ఉన్నారు. కానీ ఐపీఎల్ 2025 లో అసలు ఏమాత్రం కూడా వారి బౌలింగ్ పడటం లేదు. దీంతో చెన్నై కు చిక్కులు వస్తున్నాయి. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. దీనికి తోడు ఫేస్ బౌలింగ్ లో పతిరానా ఫామ్ కోల్పోయాడు. ఖలీల్ అహ్మద్ ఒక్కడే కాస్త పర్వాలేదు అనిపించుకుంటున్నా.. అతడికి తోడు వికెట్లు తీసేవారు కరవయ్యారు.

బ్యాటింగ్ లో దారుణం..

దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి ఘోరంగా ఫామ్ కోల్పోయారు. వీరితో పాటు దోని, శివమ్ దూబె, కూడా ఏ మాత్రం రాణించడం లేదు. విదేశీ ప్లేయర్ల సంగతి మరిచిపోవాల్సిందే. ఎన్నో ఆశలు పెట్టుకున్న రచిన్ రవీంద్ర తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. మరో ఎండ్ లో మిగతా ముగ్గురు విదేశీ ప్లేయర్లు కూడా ఏ మాత్రం ఫర్ఫామెన్స్ చూపించడం లేదు. డేవాన్ కాన్వే, సామ్ కరణ్ ఇద్దరూ ఫామ్ కోల్పోయారు. ప్రస్తుతం ఏదైనా అనుకూలంగా చెన్నై సూపర్ కింగ్స్ కు ఉందంటే ఇద్దరు యువ ఓపెనర్లు షేక్ రషీద్, ఆయుశ్ మాత్రే. ఇద్దరు యువ కిశోరాలు బ్యాటింగ్ లో సూపర్ గా ఆడుతున్నారు. పెద్ద స్కోర్లు చేయలేకపోతున్నప్పటికీ మంచి స్టార్ట్ ఇస్తున్నారు.

వచ్చే సీజన్ కు దోని డౌటే..

మహేంద్ర దోని వచ్చే సీజన్ కు ఆడటం డౌట్ గానే కనిపిస్తోంది. ఇప్పటికే మోకాలికి సర్జరీ చేయించుకున్నప్పటికీ ఈ ఐపీఎల్ లో ఆడుతున్నాడు. కానీ మరో సీజన్ ఆడేలా కనిపించడం లేదు. అయితే దోని వెళ్లబోయే ముందు చెన్నై టీంను పూర్తిగా మార్చి వెళ్లాలి. ప్లేయర్లలో కాన్పిడెంట్ కలిగించాలి. వచ్చే సీజన్ లో అయినా టీం దాదాపు ఫస్ట్ ప్లేస్ లో ఉండాలంటే బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ పై దృష్టి సారించాలి. చెన్నై టీం ఈ సీజన్ లో రాణించనంత మాత్రాన తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ అయిదు ఐపీఎల్ టైటిల్స్ సాధించి తన సత్తా ఎంటో అందరికీ చాటింది. ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెన్నై ఫ్యాన్స్ అందరూ గట్టిగానే చెబుతున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now